విద్య మరియు వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలి

Jul 21, 2024 - 16:31
Nov 2, 2024 - 07:00
 0  38
విద్య మరియు వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలి

మనభారత్ న్యూస్, హైదరాబాద్:   విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి చెప్పారు . విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. మనదేశంలో ప్రైమరీ స్కూల్స్ పై ఇప్పటికీ ప్రభుత్వాలకు , ప్రజలకు ఒక స్పష్టత లేదన్నారు.

 జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్ర మహిళా సభ డిగ్రీ ఉమెన్స్ కళాశాల ఆధ్వర్యంలో.... విద్యా, వైద్య రంగాలు - సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.... విద్యార్థుల్లో చిన్నప్పటినుంచి శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేలా పాఠ్యాంశాలు ఉండాలని, ఇందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. విద్యారంగానికి ప్రభుత్వాలు తమ బడ్జెట్లో కేటాయించాల్సిన స్థాయిలో నిధులను కేటాయించడం లేదని అన్నారు. విద్యకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. ప్రాథమిక విద్యనుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ భావాలను పెంపొందించేలా పాఠ్యపుస్తకాలను రూపొందించాలని కోరారు. యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు సైతం అశాస్త్రీయ పద్ధతులను పాటించడం ఏంటని ప్రశ్నించారు. యువత ఎక్కువగా సాంకేతిక విద్య పట్ల ఆసక్తి చూపుతోందని.. ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. సామాజిక అంశాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఆర్ట్స్ ,సైన్స్ సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని... కావున విద్యార్థులు సాంకేతిక విద్య కే ప్రాధాన్యత కాకుండా సామాజిక అంశాలకు కూడా ఎంచుకోవాలని కోరారు.

 జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.... సమాజంలో పేదలకు సరైన న్యాయం అందడం లేదన్నారు. చట్టం ఒకటే అయినా అది అందరికీ సమానంగా అందడం లేదన్నారు. పేదలకు ఒకలా, ధనవంతులకు మరోలా న్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రముఖ కార్డియాలజిస్ట్ విరించి విరివింటి మాట్లాడుతూ.... ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. కానీ ప్రభుత్వాలు ఈ బాధ్యతనుండి క్రమంగా తప్పుకుంటున్నాయని చెప్పారు. చిన్న చిన్న రోగాలకు కూడా పేదలు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని చెప్పారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం ఫలితంగా.... పేదలు చిన్న చిన్న వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సర్కార్ ఆస్పత్రులను బలోపేతం చేయాలని.. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోయ వెంకటేశ్వర్ రావు, టి. శ్రీనాథ్, రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య, వెంకటరమణారెడ్డి, జితేందర్, చెలిమెల రాజేశ్వర్, ప్రొఫెసర్ బి.యన్.రెడ్డి, డాక్టర్ రమాదేవి, ఎస్పీ లింగస్వామి , రవీంద్రబాబు ,భీమేశ్వర్, ఆంధ్ర మహిళా సభ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ పి. రజిని ,ప్రిన్సిపల్ డాక్టర్ K. ఝాన్సీ రాణి, అధ్యాపకులు డాక్టర్ K. కరుణాదేవి డాక్టర్ వై. వసుంధర సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

 వి. కృష్ణ మోహన్ 

జాతీయ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) 

కార్యదర్శి, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా) నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సి.సి.పి.ఏ) అనుబంధం 9182189533, 9440668281 హైదరాబాద్ kmdrdo@gmail.com

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin RajaBharat News is a comprehensive news platform delivering the latest updates from the Telugu states and beyond. With a strong focus on local, national, and international news, RajaBharat News brings timely and accurate coverage of politics, entertainment, sports, business, technology, and more. Whether you're looking for breaking news in Andhra Pradesh and Telangana or want to stay informed about global developments, RajaBharat News offers insightful reporting and in-depth analysis. Stay connected with all the happenings around the world, with a special emphasis on the latest from the Telugu states, all in one place.